*పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత దేవ్జీ*
నేటి ఇజం: హైదరాబాద్:24/02/2026.
హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ మంగళవారం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు బడే చొక్కారావు, మల్లా రాజిరెడ్డి, నూనె నర్సింహారెడ్డి కూడా లొంగిపోయారు. ఈ మేరకు డీజీపీ శివధర్రెడ్డి విలేకరుల సమావేశంలో ప్రకటించారు.


0 Comments