సింగరేణి లో మొగిన సమ్మె సైరాన్
నేటి ఇజం: 12/02/2026: శ్రీరాంపూర్ కాలనీ
ఫిబ్రవరి 12వ తేదీన ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మె లో భాగంగా శ్రీరాంపూర్ ఏరియ లో అన్ని కార్మిక సంఘాలు కలిసి JAC* ఆధ్వర్యంలో అన్ని గనుల మీద నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహించారు, మరియు శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా, రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ
*1) కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షేక వ్యతిరేక విధానాలకు మరియు నాలుగు లేబర్ కోడ్ ల రద్దు చేయాలి.*
*2) కాంట్రాక్ట్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.*
*3) సింగరేణికి చెల్లించాల్సిన అప్పు సుమారు 47 వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలి.*
*4) బొగ్గు తీసే పనుల్లో పర్మనెంట్ కార్మికులనే నియమించాలి.*
*5) నూతన బొగ్గు గనులు ఏర్పాటు చేయాలి.*
6).*సింగరేణిలో వెంటనే మెడికల్ బోర్డును ఏర్పాటుచేసి కార్మికులకు న్యాయం చేయాలి*
7.సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి పథకం అమలు చేయాలి
ఇలా మరెన్నో కార్మికుల హక్కులు కాల రాస్తున్న బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్త సమ్మెలో అందరు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కందికట్ల వీరభద్రయ్య ముసుకి సమ్మయ్య ఎస్కే బాజీ సైదా ఐ ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు గట్టి శంకర్రావు గర్గస్వామి జీవన్ జోయల్ సిఐటియు నాయకులు బాలాజీ చంద్రశేఖర్ నాయకులు బండి రమేష్ పొగాకు రమేష్ ఐఎఫ్టియు బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.



0 Comments